టాంక్బండ్ పైన ప్రముఖుల విగ్రహాలు ద్వంసం చేయడం , వాటి పునప్రథిష్టను అడ్డుకోవడం ఎంత వరకు సబబు ? . ఇటువంటి అరాచక శక్తులను నమ్మి తెలంగాణా ప్రజలు మోసపోతునారు . రాష్ట్రం కలిసిఉండడం లేదా విడిపోవడం మాట పక్కన పెడితే ఇటువంటి చర్యలు ఎలా సమర్థిస్తారు? ఇన్ని వందల మందిని ఆత్మహత్యలకు వుసికొలిపింది వీరు కాదా ? మానసికంగా వారిని వసపరుచుకొని వారిని ఆత్మహత్యలకు ప్రేరేపించింది ఈనాటి రాజకీయ నాయకులు కాదా ? ఇంతమంది తల్లుల కడుపుకోతకు వీరు బాద్యులు కారా . ఈ రాజకీయ నాయకుల వారసులు మాత్రం ఆత్మహత్యలు చేసుకోరు ఎందుకు ? తెలంగాణ ఏర్పాటు ఇంతమంది కోరుతున్నారు కదా మరి ఇంతకు తెలంగాణ ఏర్పాటు ఐతే వీరికి కలిగే ప్రయోజనాలు ఏమిటో క్లియర్ గా యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలుకూ తెలియచేయాలి .
గవర్నమెంట్ జాబ్స్ పెరుతుందా ? మరి అలా పెరిగితే ఎయే విబాగంలో ఎన్ని జాబ్స్ పెరుగుతుంది .
ప్రైవేటు జాబ్స్ పెరుతుందా ? మరి అలా పెరిగితే ఎయే విబాగంలో ఎన్ని జాబ్స్ పెరుగుతుంది .
నీటి వనరులు పెరుగుతుందా ? ఐతే ఎలా పెరుగుతుంది ?
వున్న నీటివనరులు సరిగా వినియోగం చేసుకుంటార ? ఎలా చేసుకుంటారు ?
ఇక్కడ అందరూ అంటున్న పదం ఒకటుంది . మా నేల పైన మీ పెత్తనం ఏమిటని . ఇక్కడ మీ నేల మా నేల అని కాదు . ఈరోజు మీరు వేరే కుంపటి పెట్టుకుంటే నష్టపోయేది మిగిలిన ప్రాంత వాసులే అనే విషయం మరువరాదు . అందుకే తెలంగాణా సోదరులారా . మీ ప్రాంతం మీ ఇష్టం . మీ ప్రత్యేక రాష్ట్ర కోరిక ఎవరు కాదు అనలెరు . ఎందుకంటే అది మీ హక్కు . మిగిలిన ప్రాంత వాసులు నష్టపోతారు అని మీ కోరికను కాదనడం కూడా సమంజసంగా లేదు . కాని ఆత్మహత్యల వరకు వెళ్ళడం తల్లిదండ్రులు దిక్కులేనివారిని చేసి స్వార్థ రాజకీయ శక్తులు వారి మాటలకు ప్రలోబాలకు లొంగి మీ జీవితాన్ని బలిచేసుకోవద్దు . మీరు విడిపోయాక కూడా మనమందరం ఇలాగె కలిసివుందాం అనే ఒక వాతావరణం క్రియేట్ చేయండి . విద్వంసం సమస్యలు పరిష్కారం కాదు . ఇలాంటి సంగటనలు సమస్యలను ఇంకా జటిలం చేస్తుండే కానీ వేరే ఒరిగేదేమీ లేదు .
మీ అబిప్రాయాన్ని కూడా తెలియచేయండి